వెలుగు: తొలి మ్యాచ్లోత్రుటిలో విజయాన్ని చేజార్చుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై బోణీకొట్టేందుకు రెడీ అయింది. ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో శుక్రవారం జరిగే తొలిహోమ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. కోల్ కతాతో మ్యాచ్ లో వార్నర్ చెలరేగిఆడినా.. బౌలింగ్ వైఫల్యంతో విజయం చేజార్చుకున్న హైదరాబాద్ సొంతగడ్డపై సమష్టిగా ఆడి విజయంసాధించాలని చూస్తోంది. మరోవైపు ‘మన్కడింగ్’వివాదాన్ని మరచి గెలుపు రుచి చూడాలని రాజస్థాన్ కూడా భావిస్తోంది. ఇక బాల్ టాంపరింగ్ నిషేధం తొలిగిన తర్వాత ఐపీఎల్లో బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్, అతని ఆస్ట్రేలియా సహచరుడు స్టీవ్ స్మిత్ పై ఈ మ్యాచ్లో అందరిదృష్టి నిలవనుంది. గాయం కారణంగా తొలిమ్యాచ్కు దూరమైన కెప్టెన్ కేన్ విలి యమ్ రాక ఇంకా డౌటే. హైదరాబాద్ లో అతను రెండురోజులు ప్రాక్టీస్ చేశాడు. అయితే, కేన్ ఆడేది లేనిది శుక్రవారమే నిర్ణయిస్తామని కోచ్ టామ్మూడీ తెలిపాడు. ఐపీఎల్లో అత్యంత పదునైన బౌలింగ్సన్ రైజర్స్దే.సొంతగడ్డపై మన బౌలర్లు మరింత చెలరేగుతారు.అయితే, ఫస్ట్ మ్యాచ్ డెత్ ఓవర్లలో విఫలమై మ్యాచ్ను చేజార్చుకోవడం ఆందోళన కలిగించే అంశం. భువీకూడా ఆండ్రీ రసెల్ను అడ్డుకోలేక పోయాడు
రాజస్థాన్ పటిష్టంగానే..
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా బలంగా కనిపిస్తోంది. గత సీజన్ లో అద్భుతంగా ఆడిన బట్లర్ ఫామ్ ఆ టీమ్కు సానుకూలాంశం. పంజాబ్ పై బట్లర్తో పాటు రహానె, శాంసన్, స్మిత్ కూడా బాగానే ఆడారు. వార్నర్ తొలి మ్యాచ్తోనే ఫామ్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ పోరులో సత్తా చాటి తాను కూడా జోరందుకోవాలని స్మిత్ భావిస్తున్నాడు. బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాఠి,కృష్ణప్ప గౌతమ్ కూడా బ్యాట్ తో సత్తా చాటగలరు.అందువల్ల ఆతిథ్య బౌలర్లు ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్న మూల్యం చెల్లిం చుకోక తప్పదు.