కాంగ్రెస్ పార్టీకేమా మద్దతు : తెలంగాణ ఏకలవ్య ఎరుకల సంఘాల జేఏసీ

కాంగ్రెస్ పార్టీకేమా మద్దతు : తెలంగాణ ఏకలవ్య ఎరుకల సంఘాల జేఏసీ

బషీర్ బాగ్, వెలుగు: ఈ ఎన్నికల్లో  ఎరుకల జాతి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు తెలంగాణ ఏకలవ్య ఎరుకల సంఘాల జేఏసీ తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 7 లక్షల మంది ఎరుకలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని జేఏసీ ప్రతినిధి , హైకోర్టు న్యాయవాది సుల్తానా యాదగిరి కోరారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ కృషి వల్లనే 1976లో ఎరుకలు ఎస్టీ జాబితాలో చేరారని, ఎరుకలకు ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిందని చెప్పారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్  పార్టీ ఏ ఒక్కరికీ అవకాశం కల్పించలేదన్నారు.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎరుకల కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ఏడాదికి రూ.500కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని,అందుకే ఆ పార్టీ గెలుపు కోసం తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. .