సుప్రీంకోర్టు హై-సెక్యూరిటీ జోన్‌లో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ బ్యాన్.. ఎందుకంటే..?

సుప్రీంకోర్టు హై-సెక్యూరిటీ జోన్‌లో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ బ్యాన్.. ఎందుకంటే..?

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్‎లో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం 2025, సెప్టెంబర్ 10వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు, న్యాయస్థానం ఆవరణలో ప్రతిరోజూ ఉండే ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. 

పరిపాలనా విభాగం కొత్త గైడ్స్ లైన్స్ ప్రకారం.. సుప్రీంకోర్టు హై-సెక్యూరిటీ జోన్‌లో ఏ వ్యక్తి కూడా ఫోన్‎లో ఫొటోలు తీయడానికి లేదా వీడియోలు రికార్డ్ చేయడానికి అనుమతి లేదు. హైసెక్యూరిటీ జోన్‎లో మొబైల్ ఫోన్లతో పాటు కెమెరాలు, ట్రైపాడ్‌లు, సెల్ఫీ స్టిక్‌లు ఉపయోగించడం కూడా నిషేధం. లో సెక్యూరిటీ జోన్‌‎లో మాత్రమే జర్నలిస్టులు ఇంటర్వ్యూలు, ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించడానికి అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. 

►ALSO READ | డీజిల్‌లో ఇథనాల్‌కు బదులుగా ఐసోబుటనాల్ కలుపుతాం: నితిన్ గడ్కరీ

ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒకవేళ మీడియా సిబ్బంది రూల్స్ బ్రేక్ చేస్తే ఒక నెల వరకు హై-సెక్యూరిటీ జోన్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించబడుతుందని తెలిపింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సిబ్బంది, ఇతర విభాగ ఉద్యోగులు కూడా కఠినమైన నిఘాలో ఉంటారని.. వారు కూడా ఏదైనా నిబంధనలను ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.