ఒడిశాలో అత్యంత వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథయాత్రను కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో నిలిపేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకుంది. స్థానికులతో మాత్రమే రథయాత్ర నిర్వహించుకోవచ్చని సోమవారం తాజాగా తీర్పు ఇచ్చింది. పరిస్థితులను బట్టి రథయాత్ర నిర్వహించాలా వద్దా అన్న విషయాన్ని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. రథయాత్రలో లక్షలాది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, దీనికి అనుమతి ఇస్తే వైరస్ ప్రబలే ప్రమాదం ఉందని, ఈ వేడుకను నిలిపేయాలని గత గురువారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని అడ్డుకోవద్దని, ఆ తీర్పుపై రివ్యూ చేయాలని కోరుతూ 21 మందది పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో వాటిపై ఇవాళ విచారణ చేపట్టింది. దీనిపై పిటిషనర్లతో పాటు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర కోట్ల మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన అంశమని, శతాబ్ధాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అడ్డుకోవద్దని తుషార్ మెహతా కోరారు. కరోనా దృష్ట్యా ఈసారి ప్రజలు లేకుండానే నిర్వహించేందుకు అనుమతించాలని కోరారు. కరోనా టెస్టులు చేసిన అనంతరం నెగటివ్ వచ్చిన వాళ్లు మాత్రమే జగన్నాథుడి ఆలయంలో పని చేస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయం ప్రకారం రేపు (జూన్ 23న) రథయాత్రలో పూరీ జగన్నాథుడు బయటకు రాకుండే మరో 12 ఏళ్ల పాటూ రాకూడదని కోర్టుకు వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకుని కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా స్థానికులతో రథయాత్ర నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో కరోనా వైరస్ ప్రబలకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయ కమిటీ అత్యంత జాగరూకతతో రథయాత్రను నిర్వహించవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పరిస్థితి చేయిదాపోయే ప్రమాదం ఉందనుకుంటే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రథయాత్రను నిలిపేస్తూ నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది.
జగన్నాథుడి రథయాత్రకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
- దేశం
- June 22, 2020
లేటెస్ట్
- ఒక్కో నిమ్మకాయ 10 రూపాయలా.. వారంలోనే 350 శాతం పెరిగిన ధర
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్
- రోజుకు 7 వేల కంప్లయింట్స్ : ఈసీకి పోటాపోటీగా పొలిటికల్ పార్టీస్ ఫిర్యాదులు
- వంద రోజుల్లో వంద దోపిడీలు.. మోడీ, రేవంత్ శనిలా దాపురించారు: జగదీశ్ రెడ్డి
- Premalu OTT: మూవీ లవర్స్కి బ్యాడ్ న్యూస్.. ప్రేమలు OTT రిలీజ్ మరింత ఆలస్యం!
- V6 DIGITAL 29.03.2024 EVENING EDITION
- Family Star Movie: ఫ్యామిలీ స్టార్ బడ్జెట్..విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్..ఎంతో తెలుసా?
- మిషన్ భగీరథలో 40 వేల కోట్ల కుంభకోణం : వివేక్ వెంకటస్వామి
- బీఆర్ఎస్ మునిగే నావ... అది టైటానిక్ తో సమానం
- నన్ను పిచ్చోడిని చేసిండ్రు.. కాళ్లు పట్టుకున్న మళ్లా పార్టీలోకి రానీయ్యం : కేటీఆర్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !