మరో 15 రోజుల్లో వలస కార్మికులందరినీ వారి స్వస్థలాలకు చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీం కోర్టు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఎక్కడిక్కడ నిలిచిపోయి పనులు లేక ఇబ్బందులు పడుతూ సొంతూరికి చేరడానికి సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు మే 28న వలస కూలీల నుంచి ఎటువంటి చార్జీలు వసూలు చేయకుండా వారిని స్వస్థలాలకు చేర్చాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే వారికి ఆహారం, తాగు నీటి సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇదే పిటిషన్ పై శుక్రవారం మరోసారి జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ చేపట్టింది. వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు జూన్ 3 వరకు 4200 శ్రామిక్ స్పెషల్ ట్రైన్లు నడిపామని కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. దాదాపు కోటి మందికి పైగా వలస కూలీలను వారి సొంతూర్లకు చేర్చామన్నారు. ఇంకా వలస కూలీలు మిగిలి ఉంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రైళ్లు కావాలన్న సమాచారం కేంద్రానికి ఇస్తే ఆ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసి.. 15 రోజుల్లో వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాలని సూచించింది.
15 రోజుల్లో వలస కూలీల్ని స్వస్థలాలకు చేర్చండి: సుప్రీం కోర్టు
- దేశం
- June 5, 2020
లేటెస్ట్
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay ట్రాన్జక్షన్లపై లిమిట్
- చిక్కుల్లో ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్.. విమానాల రద్దుపై ప్రభుత్వం సీరియస్
- పిటిషన్ వేసినందుకు లక్ష రూపాయలు ఫైన్ వేసిన కోర్టు
- IPL 2024: ధోనీ, కోహ్లీ ఆల్టైం రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్లో సంజు శాంసన్ అరుదైన ఘనత
- యువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు గద్దెనెక్కింది : విజయరమణారావు
- గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపల్లి అభివృద్ధి చెందుతుంది : పురాణం సతీశ్ కుమార్
- బై మిస్టేక్లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు : కిషన్ రెడ్డి
- జూన్ 5న కాంగ్రెస్ లోకి 25 మంది ఎమ్మెల్యేలు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- అదాని, అంబానీ జపం బంద్.. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ తీరు మారింది : మోదీ
- జేపీ నడ్డాకు బిగ్ షాక్.. కర్ణాటక పోలీసులు సమన్లు
Most Read News
- బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్బాడీలు
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- KIA EV3 ఎలక్ట్రిక్ SUVను మే 23న లాంఛింగ్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- భారీ వర్షం.. యాదాద్రి ఆలయంలో కొట్టుకుపోయిన చలువపందిళ్లు, రేకుల షెడ్డు