డెంటల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్

డెంటల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా డెంటల్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నలిచ్చింది. డెంటల్ కాజీల్లో దాదాపు 7వేల సీట్లు ఉన్నాయి. అయితే ఇందుకు క్వాలిఫై మార్కులు తగ్గించడం తో పాటు …ఈనెల 18 వరకు గడువు ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీట్లను మెరిట్‌ ఆధారంగానే భర్తీ చేయాలని స్పష్టం చేసింది. అర్హత మార్కులు ఎక్కవ ఉన్న కారణంగా చాలా సీట్లు మిగిలిపోయాయని… వాటిని భర్తీ చేసేందుకు అర్హత మార్కులు తగ్గించాలని ఆంధ్రప్రదేశ్‌ టెండల్ మెడికల్ కాలేజీల సంఘం సహా వేర్వేరు రాష్ట్రాల పిటిషన్లపై ధర్మాసనం తీర్పునిచ్చింది.

విచారణ సందర్భంగా అర్హత మార్కులు తగ్గించాలని పిటిషనర్లు కోరగా ఇందుకు కేంద్రం అభ్యంతరం తెలిపింది. అయితే ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం అర్హత మార్కులను తగ్గించింది. జనరల్ కేటగిరీలో 10 శాతం, OBC, SC, STలకు 15 శాతం అర్హత మార్కుల శాతాన్ని తగ్గిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.