వజ్రాలు  మెరవట్లే.. చిన్నబోయిన సూరత్ మార్కెట్

వజ్రాలు  మెరవట్లే.. చిన్నబోయిన సూరత్ మార్కెట్

తళుక్కుమనే వజ్రాలు.. మెరవడం మానేశాయి. జెమ్స్ అండ్ జ్యూయల్లరీ కళతప్పాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ పాలిషింగ్ హబ్ అయిన సూరత్‌ లో.. లక్షల మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇండియన్ ఎకానమీకి కీలక రంగమైన జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఇండస్ట్రీ తీవ్ర కుదుపులకు లోనవుతోంది. డైమండ్ మొఘల్‌ గా పేరున్న నీరవ్‌ మోడీ రూ.14 వేల కోట్ల స్కామ్ తర్వాత ఈ ఇండస్ట్రీ పూర్తిగా పడి పోయింది. ఇక అప్పుడు మొదలైన పతనం, స్లోడౌన్ ఎఫెక్ట్‌‌తో మరింత కుదేలైంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి, తొలి ఏడు నెలల కాలంలో ఇండియాకు దిగుమతి అవుతోన్న ముడి వజ్రాలు 22 శాతం వరకు తగ్గిపోయాయి.

పాలిష్డ్‌‌  డైమండ్ ఎగుమతులు 18 శాతం వరకు తగ్గినట్టు జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఎక్స్‌‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ డేటాపేర్కొంది. సూరత్‌ లో జెమ్స్ ఇండస్ట్రీలో పనిచేస్తో న్న ఉద్యోగులు తగ్గిపోయారు. ప్రతిభావంతు లైన కళాకారులకూ ఆదాయాలు 70 శాతానికి పైగా తగ్గిపోయినట్టు లోకల్ ఇండస్ట్రీ ఛాంబర్స్ ప్రకటించాయి. 40 ఏళ్లకు పైగా తన కెరీర్‌‌‌‌లో డైమండ్ ఇండస్ట్రీలో ఇలాంటి స్లోడౌన్స్ తాను చాలా చూశానని సూరత్ డైమండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబుభాయ్ కథిరియా చెప్పారు. 2008లో కూడా తీవ్ర సంక్షోభం నెలకొందని, కానీ రెం డు నెలల్లోనే పరిస్థితులన్నీ సాధారణమైపోయాయని చెప్పారు. అయితే ఈసారి మాత్రం స్లోడౌన్ ఏడు నుంచి ఎనిమిది నెలలు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిపారు. ఇదే తమ వ్యాపారాలను దెబ్బకొడుతోందని పేర్కొ న్నారు.

ఇండియా జీడీపీలో 7 శాతం ఈ రంగానిదే…

ఇండియన్ జెమ్స్ అండ్ జ్యూ యల్లరీ ఇండస్ట్రీలో 50 లక్షల మంది వర్కర్ లు పనిచేస్తున్నారు. ఇండియా జీడీపీలో 7 శాతం ఈ రంగానిదే. 15 శాతం ఎగుమతులు జెమ్స్ అండ్ జ్యూ యల్లరీకి చెందినవే ఉంటున్నాయి. ప్రస్తుత స్లోడౌన్ ఎఫెక్ట్‌‌తో కార్ల తయారీదారుల నుంచి రిటైలర్ల వరకు ఎవరికీ ఫండ్స్ దొరకడం లేదు. జెమ్స్ అండ్ జ్యూ యల్లరీ పరిస్థితి అయితే మరీ ఘోరం. నీరవ్ మోడీ పీఎన్‌ బీని రూ.14 వేల కోట్లకు ముంచి, విదేశాలకు చెక్కే సిన తర్వాత, చాలా బ్యాంక్‌‌లు జ్యూ యల్లర్స్‌‌కు డబ్బులు ఇవ్వడం మానేశాయి. ఈ రంగానికి దొరికే అప్పులు 2018 మార్చి నుంచి అక్టోబర్ వరకు 18 శాతం మేర పడిపోయాయి. డైమండ్ ఇండస్ట్రీకి తాము రుణాలివ్వమని చాలా బ్యాంక్‌‌లు కూడా తేల్చి చెబుతున్నాయని బీ. విరానీ అండ్ కో సెకండ్ జనరేషన్ డైరెక్టర్ చిరాగ్ విరానీ చెప్పారు. విరానీ అండ్ కో కంపె నీ సూరత్‌ లో డైమండ్ కట్టింగ్, పాలిషింగ్ చేస్తూ ఉంది.

ముడి వజ్రాలకు సాన సూరత్‌ లోనే…

ప్రపంచంలో గనుల నుంచి వెలికితీసిన ప్రతి 15 ముడి వజ్రాల్లో 14 వజ్రాలకు సూరత్ పరిశ్రమే సాన పెడుతోంది. ప్రముఖ ప్రొడ్యూసర్లుగా పేరున్న డీ బీర్స్, అల్రోసా పీజేఎస్‌ సీ లాంటివి కూడా ఇక్కడే సాన పెట్ టు కుంటున్నాయి. వాణిజ్య నగరంగా పేరున్న ముంబై నుంచి మూడున్నర గంటల సమయంలోనే సూరత్‌ ను చేరుకోవచ్చు. సూరత్‌ జెమ్స్ అండ్ జ్యూయల్లరీకే కాక, టెక్స్‌‌టైల్, రియల్ ఎస్టేట్ రంగాలకూ పేరుగాంచ ింది. ఈ నగరంలోని జెమ్స్ అండ్ జ్యూయల్లరీ రంగంలో 10 లక్షల నుంచి 15 లక్షల మంది పనిచేస్తున్నారు. చాలా మంది వర్కర్లు ఈ నగరానికి తరలి వెళ్లి, జెమ్స్ అండ్ జ్యూ యల్లరీ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటారు. చాలా మంది స్కిల్డ్ ఆర్టిజన్స్(నైపుణ్య వంతు లైన కళాకారులు) ఇక్కడ ఉన్నారు. చిన్న, పెద్ద యూనిట్లను కలుపుకుంటే మొత్తంగా 5 వేల వరకు ఇక్కడ ఉంటాయి.