
ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ హీరోలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇప్పుడీ వరుసలో సూర్య సినిమా కూడా చేరింది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువా’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
షూటింగ్ పూర్తయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉండబోతోందని చెప్పారు నిర్మాత జ్ఞానవేల్ రాజా. ప్రీ ప్రొడక్షన్ టైమ్లోనే రెండు భాగాలుగా తీయాలనుకున్నామని, కథలు కూడా రెడీగా ఉన్నాయని కానీ ఫస్ట్ పార్ట్ మాత్రమే షూట్ పూర్తి చేసినట్టు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
వచ్చే ఏడాది చివర్లో లేదా 2026 ప్రారంభంలో పార్ట్ 2 షూటింగ్ ప్రారంభిస్తామని, 2027 సంక్రాంతి లేదా సమ్మర్ సీజన్లో రిలీజ్ చేస్తామని జ్ఞానవేల్ రాజా అన్నారు. సూర్య కెరీర్లో ఇది 42వ చిత్రం. దిశాపటానీ హీరోయిన్. బాబీడియోల్
కీలకపాత్ర పోషిస్తున్నాడు.