విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ఉదయం తన అధికారిక నివాసాన్ని వదిలివెళ్లారు. గత ప్రభుత్వం హయాంలో న్యూఢిల్లీలోని సఫ్దార్ జంగ్ లేన్ లో ఆమెకు ఇక్కడ అధికారిక భవనం కేటాయించారు. 16వ లోక్ సభను రాష్ట్రపతి రద్దు చేసిన నెలరోజుల్లోనే ఆమె తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ట్విట్టర్ లో ఆమె ఈ విషయం చెప్పారు. “అధికారిక నివాసం ఖాళీ చేశాను. ఇంతకుముందు నన్ను కాంటాక్ట్ చేసిన అడ్రస్, ఫోన్లు నంబర్లు ఇకనుంచి పనిచేయవు. దయచేసి ఈ విషయం గమనించండి” అని ఆమె ట్విట్టర్ లో చెప్పారు.
సుష్మ స్వరాజ్ తీసుకున్న నిర్ణయాన్ని నెట్ యూజర్స్ మెచ్చుకున్నారు. యూ ఆర్ ఎ లెజెండ్ మేడమ్ అంటూ ప్రశంసలు గుప్పించారు. “ఎంతోమంది అధికారం, పదవి దూరమైనా ఇంకా వాటినే అంటిపెట్టుకుని ఉంటారు. మీరు రాజకీయనాయకులకు స్ఫూర్తినిచ్చే నిర్ణయం తీసుకున్నారు” అంటూ ప్రశంసించారు. సుష్మ ట్వీట్ ను వేల సంఖ్యలో రీట్వీట్లు చేశారు. లైక్ లు కొట్టారు. రిప్లైలు ఇచ్చారు.
I have moved out of my official residence 8, Safdarjung Lane, New Delhi. Please note that I am not contactable on the earlier address and phone numbers.
— Sushma Swaraj (@SushmaSwaraj) June 29, 2019