సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

ప్రపంచం నుంచి దారిద్ర్యం, ఆకలి బాధలను తరిమి వేయాలనే ధ్యేయంతో మిలీనియం డెవలప్​మెంట్​ గోల్స్​ స్థానంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అజెండాను 2015, సెప్టెంబర్ లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ లక్ష్యాలను 2016, జనవరి నుంచి 2030 డిసెంబర్​ వరకు సాధించాలని తలపెట్టారు. వీటిని 193 దేశాలు అంగీకరించాయి. ఇందులో ఇండియా కూడా ఉంది. 

ప్రపంచ జనాభాలో 17శాతానికి పైగా జనాభాను ఇండియా కలిగి ఉంది. అందుకే ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇండియా లక్ష్యాల సాధన కీలకమైంది. ప్రపంచ జనాభాలో 1/6 వంతు మనదేశంలో ఉంది. కాబట్టి ఎస్​డీజీ లక్ష్యాలను ఇండియా సాధించలేకపోతే ప్రపంచం కూడా సాధించలేదు. మన దేశంలో చాలా పథకాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగానే ఉన్నాయి. 

ఎస్​డీజీ ఇండియా ఇండెక్స్​ - 2018

ఎస్​డీజీ ఇండియా ఇండెక్స్ మొదటి ఎడిషన్​ను 2018లో ప్రకటించారు. ఇందులో 62 సూచీలు, 39 లక్ష్యాలు, 13 ఎస్​డీజీ గోల్స్​తో అనౌన్స్​ చేశారు. సరైన సమాచారం లేకపోవడంతో ఎస్​డీజీ 12, 13, 14, 17 లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోలేదు. భారత్​ సగటు విలువ 57. మొదటి స్థానంలో 69 స్కోర్​తో హిమాచల్​ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. చివరి స్థానంలో 42 స్కోర్​తో ఉత్తర్​ప్రదేశ్​ ఉంది. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్​, తొమ్మిదో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. 

ఎస్​డీజీ ఇండియా ఇండెక్స్​ - 2019

2019 డిసెంబర్​లో రెండో ఎడిషన్​ను ప్రకటించారు. 100 సూచీలు, 54 టార్గెట్స్​, 54 లక్ష్యాలతో ప్రకటించారు. అయితే 16 గోల్స్​కు ర్యాంకులు ప్రకటించారు. దేశ సగటు 60. మొదటి స్థానంలో కేరళ(70) ఉంది. చివరిస్థానంలో  బిహార్ (50) ఉంది. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులు (67) ఉన్నాయి. 

ఎస్​డీజీ ఇండియా ఇండెక్స్​ - 2021

2021 జూన్​లో మూడో ఎడిషన్​ను ప్రకటించారు. 115 సూచీలు, 70 టార్గెట్స్​, 17 లక్ష్యాలతో ప్రకటించారు. 17వ గోల్​ను గుణాత్మకంగా అంచనా వేశారు. 

మెథడాలజీ :  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇండికేటర్స్​ను తయారుచేస్తారు. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్కోర్​ను గణిస్తారు. వీటి స్కోర్​ 0 నుంచి 100 మధ్యలో ఉంటుంది. 0 కనిష్ట సామర్థ్యాన్ని తెలుపగా 100 గరిష్ట సామర్థ్యాన్ని సూచిస్తుంది. స్కోర్​ను అనుసరించి రాష్ట్రాలను నాలుగు రకాలుగా విడదీస్తారు. 

ప్రయోజనాలు 

ఎస్​డీజీ ఇండెక్స్​ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తాము ఏ స్థితిలో ఉన్నామో తెలుపుతుంది. జాతీయస్థాయితో పోల్చితే తమ స్థితి ఎక్కడ ఉన్నది తెలుస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రాధాన్యతా రంగాలను గుర్తించడానికి వీలు కలుగుతుంది. ఏ అంశాల్లో డేటా గ్యాప్​ కనిపిస్తుందో తెలుస్తుంది. 

ఇండియా ఎస్​డీజీ ఇండెక్స్​ స్కోర్​ 66

రాష్ట్రాల స్కోర్​ 52 నుంచి 75 మధ్య, కేంద్ర పాలిత ప్రాంతాల స్కోరు 62 నుంచి 79 మధ్య ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎస్​డీజీ ఇండెక్స్​ను గణిస్తే మొదటి స్థానంలో కేరళ (75), రెండో స్థానంలో హిమాచల్​ప్రదేశ్​, తమిళనాడు (74),  ఆ తర్వాతి స్థానంలో ఏపీ, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్​(72) స్కోర్​తో ముందంజలో ఉండగా, 52 స్కోర్​తో బిహార్ చివరి స్థానంలో ఉంది. ​

కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి స్థానం చండీగఢ్​ (79), చివరి స్థానంలో దాద్రా నగర్​ హవేలీ డామన్​ డయ్యూ (62) ఉన్నాయి. 2020–21 ఎస్​డీజీ ఇండెక్స్​లో 15 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఫ్రంట్​ రన్నర్​గా ఉన్నాయి. ఏ ఒక్క రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం అస్పిరెంట్​గా, ఏ ఒక్క రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం అచీవర్​గా లేవు. మిగిలినవి ఫర్ఫార్మర్​(14)గా ఉన్నాయి. 2019 నుంచి 2020 నాటికి ఎస్డీజీ ఇండియా ఇండెక్స్​ స్కోర్​లో ఎక్కువ పెరుగుదల గల రాష్ట్రం మిజోరాం. రెండో స్థానంలో హర్యానా, మూడో స్థానంలో ఉత్తరాఖండ్​ ఉన్నాయి.