స్వర భాస్కర్కు కొవిడ్ పాజిటివ్

స్వర భాస్కర్కు కొవిడ్ పాజిటివ్

ముంబై: దేశంలో కరోనా విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే భారత్ లో లక్షకు పైగా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా కొవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు, మంచు లక్ష్మి, కరీనా కపూర్, ఏక్తా కపూర్ వంటి స్టార్స్ కరోనా బారిన పడగా.. తాజాగా మరో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కు వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

‘నాకు కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నా. రుచిని కోల్పోయా. కొన్ని రోజులుగా నన్ను కలసిన వారికి టెస్టులు చేయించుకోవాలి' అని స్వర సూచించింది. డబుల్‌ మాస్క్‌ ధరించి అంరదూ సురక్షితంగా ఉండాలని కోరింది. ఇప్పటికే తాను డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నందున త్వరలోనే నెగెటివ్‌ వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. 

మరిన్ని వార్తల కోసం:

వనమా రాఘవను ఉరి తీయాలె

మోడీ ఘటనలో ఉగ్రవాద హస్తాన్ని తోసిపుచ్చలేం

కేసీఆర్ పథకాలు చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నయ్