రాపిడోలో వాటా అమ్మనున్న స్విగ్గీ

రాపిడోలో వాటా అమ్మనున్న స్విగ్గీ

న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ రాపిడోలో ఉన్న తన వాటాలను రూ. 2,400 కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ వాటాలను ప్రోసస్, వెస్ట్‌‌ బ్రిడ్జ్​లకు విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 1,968 కోట్ల విలువైన 1,64,000 వాటాలను నెదర్లాండ్స్​లో ఉన్న ఎంఐహెచ్​ ఇన్​వెస్ట్​మెంట్స్​ వన్​ బీవీకి విక్రయిస్తారు. ఇది ప్రోసస్​ గ్రూప్​లో భాగం.  సెబీ  రెగ్యులేషన్స్ కింద నమోదు అయిన సెటు ఏఐఎఫ్​ ట్రస్ట్​కు (వెస్ట్‌‌బ్రిడ్జ్​) రూ. 431.49 కోట్లకు 35,958 వాటాలను విక్రయించనుంది.

రాపిడో ఫుడ్​ డెలివరీ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తున్న నేపథ్యంలో స్విగ్గీ నిర్ణయం తీసుకుంది.  స్విగ్గీ తన క్విక్​ కామర్స్​ వ్యాపారం అయిన ఇన్​స్టామార్ట్​ను స్విగ్గీ ఇన్​స్టామార్ట్​ ప్రైవేట్​ లిమిటెడ్​కు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇది కంపెనీకి అనుబంధంగా ఉంటుంది. సంస్థ పునర్‌‌వ్యవస్థీకరణ, వనరుల మెరుగైన వినియోగం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్విగ్గీ తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరం ఇన్​స్టామార్ట్​ ఆదాయం రూ. 2,129.58 కోట్లు.