
న్యూఢిల్లీ: దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట స్వైన్ఫ్లూ కేసు ఒక్కటైనా నమోదవుతోంది. తాజాగా ఆ వైరస్ సుప్రీంకోర్టును కూడా పాకింది. స్వైన్ఫ్లూ దెబ్బకు ఆరుగురు జడ్జీలు అనారోగ్యం పాలయ్యారు. మతం మరియు హక్కులకు సంబంధించిన కేసు విచారణల్లో పాల్గొనే తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్లో ఆరుగురు ఈ వైరస్ బారిన పడినట్లు జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. న్యాయమూర్తులందరూ చీఫ్ జస్టిస్ ఎస్ఎ బొబ్డేతో సమావేశమై పరిస్థితిపై చర్చించారు. సుప్రీంకోర్టులో పనిచేసేవారికి టీకాలు వేయించాలని చీఫ్ జస్టిస్ బొబ్డేను కోరినట్లు జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.
ఈ విషయంపై చర్చించడానికి ప్రధాన న్యాయమూర్తి బొబ్డే; సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దావేతో సమావేశమయ్యారు. ఆరుగురు జడ్జీలకు స్వైన్ఫ్లూ సోకిందని తెలిసి జస్టిస్ బొబ్డే చాలా ఆందోళనకు గురయ్యారని దుష్యంత్ దావే అన్నారు. సుప్రీంకోర్టులో పనిచేసే వారందరికీ టీకాలు వేయడం కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక డిస్పెన్సరీని ఏర్పాటు చేస్తోందని దుష్యంత్ దావే తెలిపారు.
జర్మన్ సాఫ్ట్వేర్ సంస్థ SAP తన బెంగళూరు కార్యాలయంలో పనిచేసే ఇద్దరికి ఈ వైరస్ సోకడంతో భారత్లోని తన కార్యాలయాలన్నింటిని ఆ సంస్థ గత వారం తాత్కాలికంగా మూసివేసింది.
For More News..