యూఏఈలోనే  టీ20 వరల్డ్​కప్!

యూఏఈలోనే  టీ20 వరల్డ్​కప్!

ముంబై: టీ20 క్రికెట్​ వరల్డ్​కప్​ ఆతిథ్యంపై ఐసీసీకి క్లారిటీ ఇచ్చేందుకు  గడువు (జూన్​ 28) దగ్గరపడుతున్న వేళ ఈ అంశంపై బీసీసీఐ నుంచి కీలక ప్రకటన వచ్చింది. అక్టోబర్–నవంబర్​లో ఇండియాలో జ రగాల్సిన మెగా టోర్నీ యూఏఈకు తరలి వెళ్లడం దాదాపుగా ఖాయమైంది. బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. ‘మన దేశంలో కరోనా పరిస్థితి దృష్ట్యా టీ20 ‌‌‌‌వరల్డ్​కప్​ను యూఏఈ తరలించే ఆలోచనలో ఉన్నాం. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం. ప్లేయర్ల ఆరోగ్యం, భద్రత కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు. టోర్నీ ఆతిథ్యంపై అతి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం’ అని జైషా ప్రకటించారు. యూఏఈ, ఒమన్​ వేదికలుగా ఈ ఏడాది టీ20 వరల్డ్​కప్​ జరిగే అవకాశముందని ఇదివరకే  బీసీసీఐ వర్గాలు లీకులిచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్​ కూడా అరబ్​గడ్డలో జరగడం ఖాయమైతే.. ఫారిన్​ ప్లేయర్ల అంశంలో ఫ్రాంచైజీలకున్న టెన్షన్​ తగ్గనుంది.