16 న్యూస్​చానెల్స్​పై చర్యలు తీస్కోండి

16 న్యూస్​చానెల్స్​పై చర్యలు తీస్కోండి

జూబ్లీహిల్స్, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్​పై కొన్ని న్యూస్ చానెల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని బీఆర్ఎస్​నేతలు శుక్రవారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట పోలీస్​స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. లిక్కర్​స్కామ్​కేసులో ఈడీ కేసీఆర్​పేరును ప్రస్తావించినట్లు ఇటీవల 16 న్యూస్​చానెల్స్ కథనాలు ప్రచారం చేశాయని పేర్కొన్నారు.

ఆయా మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసినవారిలో బంజారాహిల్స్​డివిజన్​బీఆర్ఎస్ కో-ఆర్డినేటర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర నాయకులు​ఉన్నారు.