తమిళనాడులో భారీ వర్షాలకు 12 మంది బలి

తమిళనాడులో భారీ వర్షాలకు 12 మంది బలి
  • రాష్ట్రంలో 20 జిల్లాలకు రెడ్ ​అలర్ట్​
  • ఇయ్యాల చెన్నైలో భారీ వర్షం పడే చాన్స్

చెన్నై: తమిళనాడులోని చెన్నై సహా 20 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్​అలర్ట్​ప్రకటించింది. ఇప్పటికే కుండపోత వానలు కురుస్తున్న చెన్నైలో గురువారం భారీ వర్షం కురవొచ్చని వెల్లడించింది. వర్షం పడే టైమ్​లో జనాలు బయటకు వెళ్లొద్దని.. తిండి, నీళ్లు రెడీగా పెట్టుకోవాలని గ్రేటర్​ చెన్నై కమిషనర్​గగన్ దీప్​సింగ్​బేడి కోరారు. కమ్యూనికేషన్​కోసం ఎలక్ట్రానిక్​పరికరాలను ముందు జాగ్రత్తగా బాగా చార్జ్​చేసుకోవాలన్నారు. చెన్నైలో 53 బోట్లు, 507 మోటార్​పంపులు, 60 హెవీ డ్యూటీ పంపులు సిద్ధం చేశామని చెప్పారు. చెంబరమ్​బక్కమ్​సహా సిటీకి దగ్గర్లోని అన్ని రిజర్వాయర్ల నుంచి నీటిని మెల్లమెల్లగా రిలీజ్​చేస్తామన్నారు. ప్రస్తుతం 169 రిలీఫ్​సెంటర్లు పని చేస్తున్నాయని, నీట మునిగిన 400 ప్రాంతాల్లో 216 ప్రాంతాలను క్లియర్​చేశామని వివరించారు. అమ్మ క్యాంటీన్లలో ఆహారాన్ని ఫ్రీగా ఇస్తామని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆహారం సరఫరా చేస్తామని తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం 434 సైరన్​ టవర్లను ఏర్పాటు చేసింది.

12కు పెరిగిన మృతులు

కొద్ది రోజులుగా తమిళనాడులో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఇప్పటివరకు 46% ఎక్కువ వర్షం కురిసిందని అధికారులు చెప్పారు. భారీ వానలు, వరదలకు ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. 530 ఇండ్లు డ్యామేజ్​ అయ్యాయి. 1,700 కన్నా ఎక్కువ మంది రిలీఫ్​క్యాంపుల్లో ఉన్నారు. చెన్నైలో 2015 తర్వాత ఇంత స్థాయిలో వానలు కురవడం ఇదే తొలిసారి.