
మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ కమిటీ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని, చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. డీఎంహెచ్వో డాక్టర్ హరీశ్ రాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న మందుల వివరాలు, ఆహారం గురించి అడిగి తెలుసుకున్నామన్నారు.
బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందిస్తున్నారో లేదో తెలుసుకోవడంతో పాటు రోగులను 20 రకాల ప్రశ్నలు అడిగి సమాధానాలను నమోదు చేశామన్నారు. కిచెన్ను తనిఖీ చేసి సూచనలు చేశారు. డాక్టర్ భీష్మ, ఆర్ఎంవో ప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ బాలాజీ లింగారెడ్డి, బుక్క వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.