వరంగల్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

 వరంగల్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

వరంగల్: ఆల్ఫా జోలం అనే మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నుండి వరంగల్ మీదుగా హైదరాబాద్ కి అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుపడిన నిందితుల వద్ద రూ.2 లక్షల 13 వేల విలువైన  కిలో  ఆల్ఫా జోలం అనే మత్తు పదార్థంతోపాటు  6సెల్ ఫోన్లు,  కారు స్వాధీనం చేసుకున్నారు. 

నిందితులు ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసి ఆల్ఫా జోలంను మత్తు మందుగా తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. మత్తు పదార్థాలను నిందితులు రాజశేఖర లక్ష్మణరావు, పూసల చైతన్య కుమార్, లింగాల సైదులు  హైదరాబాదు నగరంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.