టాటా మోటార్స్ నెక్సాన్ కొత్త ఈవీని రూ. 14.74 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 465 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ మోడల్ మరొక ఈవీని ఛార్జ్ చేయగలుగుతుంది. గాడ్జెట్లు, ఎలక్ట్రికల్ క్యాంపింగ్ పరికరాలు, పవర్ టూల్స్ వంటి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను చార్జ్ చేయగలుగుతుంది. పన్నెండు ఇంచుల స్క్రీన్, 10 ఇంచుల ఇన్స్ట్రమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, వైర్లైస్ స్మార్ట్ఫోన్ చార్జర్, వాయిస్ కమాండ్ ఫంక్షన్, ఎయిర్ ప్యూరిఫయర్, జేబీఎల్ ఆడియో సిస్టమ్, సన్రూఫ్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం.
బ్యాటరీపై 1.60 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తారు. కంపెనీ పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో కూడిన నెక్సాన్ను రూ. 8.09 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభ ధరలతో పరిచయం చేసింది. మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి వాటితో నెక్సాన్ పోటీ పడుతోంది. తాము 2017లో నెక్సాన్ను ప్రారంభించినప్పుడు, ఈ విభాగంలో నెలకు 30 వేల యూనిట్ల విక్రయాలు జరిగేవని, ఇప్పుడు నెలకు 90 వేల యూనిట్లకు పెరిగాయని టాటా తెలిపింది. తాము దేశంలో ఇప్పటివరకు 5.5 లక్షల యూనిట్ల నెక్సాన్లను విక్రయించిందని వెల్లడించింది.