![కాంగ్రెస్లో చేరిన సిద్ధరాములు](https://static.v6velugu.com/uploads/2024/02/tatipalli-siddaram-joined-congress-on-sunday_Zc8qp9iNw6.jpg)
భిక్కనూరు, వెలుగు: తిప్పాపూర్ వెంకటేశ్వర ఆలయ చైర్మన్ తాటిపల్లి సిద్ధరాములు ఆదివారం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ ఆయనకు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
సిద్ధరాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్ప్రభుత్వ ఆరు గ్యారెంటీలు నచ్చి పార్టీలో చేరానని, ఈ పార్టీతో ప్రజలందరికీ న్యాయం జరగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు తిరుపరి భీంరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంట లింగారెడ్డి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ధర్మయ్య పాల్గొన్నారు.