ఇల్లీగల్​ బెట్టింగ్​యాప్స్​తో ఏటా...2 లక్షల కోట్ల పన్ను నష్టం

ఇల్లీగల్​ బెట్టింగ్​యాప్స్​తో ఏటా...2 లక్షల కోట్ల పన్ను నష్టం
  • క్రికెట్​దే  పెద్ద వాటా
  • ఐపీఎల్​ సీజన్​లో 34 కోట్ల మంది బెట్టింగ్​ చేస్తున్నారు
  • టీసీఎఫ్​ రిపోర్టు వెల్లడి

న్యూఢిల్లీ : క్రికెట్​ వరల్డ్​కప్​ జోరందుకోవడంతో ఇల్లీగల్​ బెట్టింగ్​ కూడా దేశంలో ఊపందుకుంది. రకరకాల మార్గాలలో కోట్లాది రూపాయలతో పందెం రాయుళ్లు  బెట్టింగ్​ చేస్తున్నారని, ఈ ఇల్లీగల్​ బెట్టింగ్​ కార్యకలాపాల వల్ల ప్రభుత్వానికి ఏటా రూ. 2 లక్షల కోట్ల పన్ను ఆదాయం పోతోందని ఒక రిపోర్టు వెల్లడించింది. ఇండియాలో ఏటా సాగుతున్న ఇల్లీగల్​ స్పోర్ట్స్​ బెట్టింగ్​ కార్యకలాపాల విలువ రూ. 8,20,000 కోట్ల (100 బిలియన్​ డాలర్లు)  దాకా ఉంటుందని ఆ రిపోర్టు తెలిపింది. థింక్​ ఛేంజ్​ ఫోరమ్​ (టీసీఎఫ్​) పై రిపోర్టును రిలీజ్​ చేసింది. డిజిటల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ​గ్రోత్​, స్మార్ట్​ఫోన్​ల వాడకం, అథ్లెటిక్​ ఈవెంట్స్​  జోరుగా సాగడం వంటి వాటితో ఇల్లీగల్​ బెట్టింగ్​ ఊపందుకుంటోందని పేర్కొంది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఇల్లీగల్​ బెట్టింగ్, గ్యాంబ్లింగ్​ దందాలు పెరుగుతూనే ఉన్నాయని టీసీఎఫ్​ రిపోర్టు వెల్లడించింది. ఈ రిపోర్టు అంచనా ప్రకారం రూ. 8.20 లక్షల కోట్ల మొత్తం ఇల్లీగల్​ బెట్టింగ్​ కోసం డిపాజిట్​ అవుతుంటే, దానిపై ఇప్పుడున్న జీఎస్​టీ రేటు 28 శాతం ప్రకారం లెక్కిస్తే ప్రభుత్వం పన్నుల రూపంలో పోగొట్టుకుంటున్న ఆదాయం రూ. 2,29,600 కోట్లవుతుందని వివరించింది. 

ఆపడం ఎలా....?

ఇల్లీగల్​ బెట్టింగ్​ కార్యకలాపాలకు చెక్​ పెట్టాలంటే జీఎస్​టీని కఠినంగా అమలు చేయాలని రిపోర్టు సూచిస్తోంది. మానిటరింగ్​ కోసం ఒక  టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేయాలని,  ఇల్లీగల్​ ఆఫ్​షోర్​ బెట్టింగ్​ కార్యకలాపాలను ఈ టాస్క్​ఫోర్స్​ దగ్గరగా పర్యవేక్షించాలని టీసీఎఫ్​సలహా ఇచ్చింది. అప్పుడే,  ఆఫ్​షోర్​ ఆపరేటర్లు కచ్చితంగా ఇండియాలో రిజిస్ట్రేషన్​ చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుందని పేర్కొంది. లేదంటే, దేశంలోని లీగల్​  గేమింగ్ ప్లాట్​ఫామ్స్​ నుంచి ఆఫ్​షోర్​ ప్లాట్​ఫామ్స్​కు అవుట్​ఫ్లోను కాపాడుకోగలుగుతామని అభిప్రాయపడింది. ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోకపోతే, జీఎస్​టీ రేటు పెంపు వల్ల ఇల్లీగల్​ బెట్టింగ్ ​ప్లాట్​ఫామ్స్​కార్యకలాపాలు  విచ్చలవిడిగా పెరగడానికి ఛాన్స్​ ఉంటుందని పేర్కొంది. 

ఫలితంగా పన్ను ఆదాయాన్ని ప్రభుత్వం నష్టపోవల్సి వస్తుందని వివరించింది. ఇండియాలో క్రికెటే డామినేట్​ చేస్తోందని, ముఖ్యంగా ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) బెట్టింగ్​ యాక్టివిటీ జోరును పెంచుతోందని వెల్లడించింది. ఇండియాలోని 14 కోట్ల మంది బెట్టింగ్, గ్యాంబ్లింగ్​ కార్యకలాపాలలో రెగ్యులర్​గా భాగం పంచుకుంటున్నారని, ఐపీఎల్​ సీజన్​లో ఈ సంఖ్య 37 కోట్ల దాకా పెరుగుతోందని టీసీఎఫ్​ రిపోర్టు  పేర్కొంది. దేశంలో బెట్టింగ్​, గ్యాంబ్లింగ్​ ట్రాన్సాక్షన్లపై బ్యాన్​ విధిస్తే, ఆఫ్​షోర్​ గ్యాంబ్లింగ్​ కంపెనీలు ఇతర మార్గాలలో డబ్బును దేశం బయటకు తీసుకెళ్తాయని వివరించింది. హవాలా, క్రిప్టో కరెన్సీ, ఇతర అక్రమ మార్గాలలో డబ్బును ఇతర దేశాలకు తరలిస్తారని  తెలిపింది.

75  బెట్టింగ్​, గ్యాంబ్లింగ్​  సైట్​లు..

టీసీఎఫ్​ రిపోర్టు లెక్కల ప్రకారం  బెట్టింగ్​, గ్యాంబ్లింగ్​ను ప్రోత్సహించే 75 వెబ్​సైట్లు పనిచేస్తున్నాయి. ఈ వెబ్​సైట్లన్నీ మన దేశంలోని ప్రజలనే టార్గెట్​ చేసుకుంటున్నాయి. లీగల్​గా కొన్నింటి ఆపరేషన్స్​పై బ్యాన్ పెట్టినా, ఏదోలా అవి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని టీసీఎఫ్​ రిపోర్టు చెబుతోంది. పాపులర్​ బాలీవుడ్​ యాక్టర్లు, స్పోర్ట్స్​ పర్సనాలిటీలను వాడుకుని మరీ దేశంలోని యూజర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలను ఆ ఆపరేటర్లు చేస్తున్నారని వివరించింది. సెల్ఫ్ ​రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్​ (ఎస్​ఆర్​ఓ)ల ఏర్పాటులో ఆలస్యం జరిగితే ఆఫ్​షోర్​ బెట్టింగ్​ సైట్లు మరిన్ని పెరుగుతాయని రిపోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్​ఆర్​ఓలు లేకపోతో ఎవరు లీగల్​ ఆపరేటర్​, ఎవరు ఇల్లీగల్​ ఆపరేటర్​ అనేది తేల్చడం కష్టసాధ్యంగా మారి, రెగ్యులేటర్లు చర్యలు తీసుకోలేరని వెల్లడించింది.