
న్యూఢిల్లీ: టాప్ 25 ఐటీ సర్వీసెస్ బ్రాండ్స్లో మన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్లు రెండు, మూడో ప్లేస్లను దక్కించుకున్నాయి. బ్రాండ్ ఫైనాన్స్ ఏటా ప్రకటించే ఈ జాబితాలో యాక్సెంచర్ వరసగా నాలుగో ఏడాది మొదటి ప్లేస్లో నిలిచింది. ఐబీఎంను రెండు ప్లేస్లు వెనక్కి నెట్టాయి టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు. దీంతో ఐబీఎం నాలుగో ప్లేస్కు పడిపోయింది. మరో నాలుగు భారత కంపెనీలకూ ఈ జాబితాలో చోటు దొరికింది. విప్రో (7 ), హెచ్సీఎల్ (8), టెక్ మహీంద్రా (15), ఎల్టీఐ (22) ప్లేస్లను పొందినట్లు బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్టు వెల్లడించింది. మొదటి ప్లేస్లోని యాక్సెంచర్ బ్రాండ్ వాల్యూ ఏకంగా 36.2 బిలియన్ డాలర్లని తెలిపింది. డిజిటల్ స్కిల్స్ తెలిసిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉండటంతో మన కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) రంగాలలో లీడ్ చేస్తాయని బ్రాండ్ ఫైనాన్స్ పేర్కొంది. 2021లోనే టీసీఎస్ 25 బిలియన్ డాలర్ల రెవెన్యూ మార్కును అందుకుంది. 25 శాతం ఆపరేటింగ్ మార్జిన్ను ఈ కంపెనీ సంపాదించగలుగుతోంది.