స్టూడెంట్​కు టీచర్ అసభ్యకర మెసేజ్​లు

స్టూడెంట్​కు టీచర్  అసభ్యకర మెసేజ్​లు
  •     చితకబాది పోలీసులకు అప్పగించిన పేరెంట్స్
  •     నిందితుడిపై పోక్సో కేసు

యాదాద్రి, వెలుగు : స్టూడెంట్​కు అసభ్య మెసేజ్​లు పంపిస్తూ వేధిస్తున్న టీచర్​పై పోక్సో కేసు నమోదైంది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా  భువనగిరిలోని ఓ ప్రైవేట్​ స్కూల్​లో జరిగింది. భువనగిరిలోని ప్రైవేట్​ స్కూల్​లో సంజయ్​ కుమార్​ సైన్స్​టీచర్​గా పని చేస్తున్నాడు. పదో తరగతి చదువుతున్న తన స్టూడెంట్​కు సెల్​ఫోన్ లో అసభ్యకర మెసేజ్​లు పంపించడం ప్రారంభించాడు. దీంతో పాటు ఆమెతో అసభ్యంగా  ప్రవర్తించాడు. 

వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు తన పేరేంట్స్​కు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన పేరెంట్స్..​ స్కూల్​కు వెళ్లి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంజయ్​ కుమార్​ను చితకబాదారు. అనంతరం భువనగిరి టౌన్​ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్కూల్ కు చేరుకుని సంజయ్ ​కుమార్​ను అరెస్టు చేశారు. అతడిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు.