వైన్స్​ను వేరే చోటికి తరలించండి

వైన్స్​ను వేరే చోటికి తరలించండి

ఉప్పునుంతల, వెలుగు: మండల కేంద్రంలోని అచ్చంపేట రోడ్​లో కొత్తగా ఏర్పాటు చేసిన వైన్  షాపును తొలగించాలని జడ్పీ హైస్కూల్​ టీచర్లు, స్టూడెంట్స్​ డిమాండ్  చేశారు. స్కూల్​ దగ్గరలో వైన్ షాప్  ఏర్పాటు చేయడంతో స్కూల్​ హెచ్ఎం, టీచర్లు ఇటీవల డీఈవోకు కంప్లైంట్  చేశారు. 

మంగళవారం ఎక్సైజ్ ఆఫీసర్లు హైస్కూల్ కు వచ్చి టీచర్లు, స్టూడెంట్స్​తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. షాప్​ ఓనర్​తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. రోడ్లపై నిల్చోవడం, రోడ్లపై యూరిన్  చేయడం లాంటి వాటితో స్టూడెంట్స్​ ఇబ్బంది పడుతున్నారని టీచర్లు పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళన చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఎక్సైజ్  సీఐ జనార్ధన్, ఎస్ఐ బాలవర్ధన్ రెడ్డి స్కూల్​ను సందర్శించిన వారిలో ఉన్నారు.