వ్యాక్సిన్ వేయించుకున్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి

వ్యాక్సిన్ వేయించుకున్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి

టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రి ఇవాళ(మంగ‌ళ‌వారం) కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ప్ర‌స్తుతం అహ్మ‌దాబాద్‌లో ఉన్న ర‌విశాస్త్రి.. అక్క‌డి అపోలో ఆస్పత్రిలో వ్యాక్సిన్ లో టీకా తీసుకున్నారు. అందుకు సంబందించిన ఫొటోను ఆయన ట్విట‌ర్‌ ట్వీట్ చేశారు. తాను వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న‌ట్లు ర‌విశాస్త్రి తెలిపారు. కరోనా మహమ్మారికి వ్య‌తిరేకంగా కృషి చేసిన వైద్య సిబ్బందికి, సైంటిస్టుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. టీకా తీసుకుంటున్న సమయంలో ఆయన టీమ్‌ ఇండియా జర్సీ ధరించారు.