టీమిండియా మాజీ ఓపెనర్ కన్నుమూత

 టీమిండియా మాజీ ఓపెనర్ కన్నుమూత

టీమిండియా మాజీ ఓపెనర్ సుధీర్ (78) నాయక్ కన్నమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుధీర్.. బుధవారం రాత్రి ముంబైలోని హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ఇంట్లో.. బాత్ రూంలో కాలు జారి కిందపడ్డాడు. దాంతో తలకు బలమైన గాయం అయింది.

ఇంతకాలం హాస్పిటల్ లో కోమాలోనే ఉన్నారు సుధీర్. ఇన్ని రోజులు కోలుకోని ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారని ముంబై క్రికెట్ అసోసియేషన్ కు చెందిన అధికారులు వెల్లడించారు. సుధీర్ నాయక్ టీమిండియా తరుపున 1974లో మూడు టెస్టు మ్యాచులు ఆడారు.

85 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 4376 పరుగులు చేశారు. ముంబైలో సుధీర్ కు మంచి కోచ్ గా పేరుంది. భారత్ మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ ఎదుగుదలలో కూడా సుధీర్ నాయక్ పాత్ర ఉంది. నాయక్‌ ముంబై సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా, వాంఖడే స్టేడియం క్యురేటర్‌గా కూడా పని చేశారు.