రాష్ట్రంలో టెక్నిప్​​ఎఫ్​ఎంసీ, ఏలియంట్ పెట్టుబడులు

రాష్ట్రంలో టెక్నిప్​​ఎఫ్​ఎంసీ, ఏలియంట్ పెట్టుబడులు

హైదరాబాద్​, వెలుగు: ఎనర్జీ రంగంలో టెక్ సేవలు అందించే  అమెరికన్​ ఆయిల్ అండ్​ గ్యాస్​ కంపెనీ టెక్నిప్​ఎఫ్​ఎంసీ హైదరాబాద్​లో రూ. 1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ డబ్బుతో సాఫ్ట్​వేర్​ గ్లోబల్​ డెలివరీ సెంటర్​, ప్రెసిషన్​ ఇంజినీరింగ్​ మాన్యుఫాక్చరింగ్​ ఫెసిలిటీలను కంపెనీ ఏర్పాటు చేయనుంది. టెక్నిక్​ ఎఫ్​ఎంసీ సాఫ్ట్​వేర్​ ఇంజినీరింగ్​ సెంటర్​లో 2,500 జాబ్స్​, మాన్యుఫాక్చరింగ్​ ఫెసిలిటీలో మరో 1,000 జాబ్స్​ క్రియేట్​ చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్​ మినిస్టర్​ కే టీ రామారావు తన ట్వీట్​లో వెల్లడించారు. 

ఏలియంట్​ నుంచి 9 వేల జాబ్స్​...

కన్సల్టింగ్​, ఫైనాన్షియల్​ సర్వీసెస్​ రంగంలోని ఏలియంట్​ గ్రూప్ ​హైదరాబాద్​లో తన ఆపరేషన్స్​ను భారీగా విస్తరించనుంది. ఈ కంపెనీ కొత్తగా 9 వేల జాబ్స్​ ఇవ్వనున్నట్లు కేటీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఏలియంట్​ గ్రూప్​ సీఈఓ ధవల్​ జాదవ్​తో మంత్రి, ఇతర అధికారులు సమావేశమయ్యారు.