
గచ్చిబౌలి, వెలుగు: సమాజానికి మేలుచేసేలా, తోటి వారికి సేవ చేసేలా టెక్నాలజీని ఉపయోగించాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ సూచించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవం మంగళవారం అట్టహాసంగా జరిగింది. గచ్చిబౌలి బ్రహ్మకుమారీస్లోని గ్లోబల్పీస్ఆడిటోరియంలో ఈ వేడుక నిర్వహించగా భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లాతో పాటు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
990 మంది స్టూడెంట్స్కు గవర్నర్ పట్టాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మేధస్సును పెంచడమే అంతిమ లక్ష్యం కావాలని అంబేద్కర్ మాటలను గుర్తుచేశారు. పట్టాలు అందుకున్న వారు ఇతరులకు అవకాశాలు సృష్టించేలా ఎదగాలని ఆకాంక్షించారు. భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. యువత ఆవిష్కరణలు, నైపుణ్యాలపై దృష్టి పెట్టాలన్నారు.
అనంతరం హెచ్సీయూ వైస్చాన్స్లర్ బీజే రావు ఎంఏ పొలిటికల్ సైన్స్లో పట్టా అందుకున్న గోపి తేజస్వీకి ఓబీసీ కేటగిరీలో గోల్డ్ మెడల్, ఐదుగురు ప్రొఫెసర్లకు చాన్స్లర్ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్సీయూ చాన్స్లర్ డాక్టర్ ఎల్.నర్సింహారెడ్డి, పలు విభాగాల డీన్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.