అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు టీనేజర్ల మృతి

అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు టీనేజర్ల మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాస్ ఏంజెలిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ టీనేజర్లు మృతి చెందారు. చనిపోయిన వారిని అక్షరా రెడ్డి, అర్జిత్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. వీరిద్దరూ తోబుట్టువులు. తెలంగాణలోని జనగామ జిల్లా బండ్లగూడెంకు చెందిన చెట్టిపెల్లి రామచంద్రారెడ్డి 20 ఏళ్ల కిందట మెరుగైన అవకాశాల కోసం అమెరికా వెళ్లారు. కుటుంబంతో కలిసి లాస్ ఏంజెలిస్ లోనే స్థిరపడ్డారు.

భార్య రజిత, కుమార్తె అక్షరా రెడ్డి, కుమారుడు అర్జిత్ రెడ్డిలతో కలిసి ఈ నెల 18న తెలుగు కుటుంబాల సమ్మేళనంలో పాల్గొన్నారు. తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అర్జిత్ రెడ్డి అక్కడికక్కడే మరణించగా.. అక్షరా రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. తండ్రి రామచంద్రారెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం..

ఒక్క ఆలోచన కోట్లు కురిపిస్తోంది