గజ్వేల్, వెలుగు: తన ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చి జూన్2 నుంచి ప్రజా పాదయాత్ర ప్రారంభిస్తానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ప్రజా సేవ చేయాలనుకునే వారు తమ ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పగించి రాజకీయాల్లోకి రావాలని సూచించారు. రాష్ట్రంలో రాజకీయ పాదయాత్రలు జరుగుతున్నాయని, తాను మాత్రం ప్రజలను చైతన్యం చేయటానికే పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. ఇకపై కేసీఆర్ను తాను ఒక్కమాట కూడా అననని, రాజకీయాలు చేయనని, ప్రజల్ని చైతన్యం చేసే లక్ష్యంతో పని చేస్తానని తెలిపారు. గురువారం గజ్వేల్లో ఆయన 7,200 సమావేశం నిర్వహించారు. అన్ని హంగులతో గజ్వేల్లో 100 పడకల హస్పిటల్ కట్టినట్టు చెప్తున్న కేసీఆర్.. తన పంటి నొప్పి చికిత్స కోసం స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీకి ఎందుకు పోతున్నాడని మల్లన్న ప్రశ్నించారు. పేదల పిల్లలు సర్కారు బడుల్లో చదువుతుంటే సీఎం మనవడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడని, అందరి పిల్లలూ సర్కారు బడుల్లోనే చదువుకునేలా వాటిని తీర్చిదిద్దడానికే 7,200 ఉద్యమమని చెప్పారు. సమావేశం తర్వాత కేసీఆర్ ఫాంహౌస్వైపు వెళ్లేందుకు మల్లన్న ప్రయత్నించారు. అయితే పాములపర్తి చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. తాను కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ను చూడటానికి వెళుతున్నానని చెప్పినా వినలేదు.మల్లన్నను పోలీసు వాహనంలో ఎక్కించి ఔటర్ రింగ్ రోడ్డు వరకు తీసుకొచ్చి వదిలేశారు.
జూన్ 2 నుంచి పాదయాత్ర చేస్త
- హైదరాబాద్
- May 6, 2022
లేటెస్ట్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- జనగామలో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత
- పెద్దపల్లి పార్లమెంట్ లో 11 గంటల్లోపు 26.33 శాతం పోలింగ్
- తెలంగాణలో 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్
- పలు గ్రామాల్లో నిలిచిపోయిన పోలింగ్.. ఓట్లు వేయమంటున్న గ్రామస్తులు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్
- జైపూర్లో ఆరు స్కూల్స్కు బాంబు బెదిరింపులు
- బతికుండగానే చనిపోయారని హిందువుల ఓట్లు తీసేశారు: మాధావిలత
- కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- అలర్ట్.. హైదరాబాద్లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- రూ. 7 లక్షల రేంజ్ లో 25 కి.మీ. మైలేజ్ అందించే కార్లు
- Kamal Haasan Look From Kalki: కల్కి నుండి లీకైన కమల్ హాసన్ లుక్.. వైరల్ అవుతున్న ఫోటో
- తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్ రోజు ఆగమాగమే..