తేజస్‌ యుద్ధ విమానం కో పైల‌ట్‌గా సింధు

తేజస్‌ యుద్ధ విమానం కో పైల‌ట్‌గా సింధు

బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్  పీవీ సింధు కు అరుదైన గౌరవం దక్కింది. ఆమె ఇవాళ లైట్ కంబ్యాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌(LCA) తేజస్‌ యుద్ధ విమానంలో విహరించింది. బెంగళూరులోని య‌ల‌హంక ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌లో ఏరో ఇండియా షోలో వుమెన్స్‌ డే సందర్భంగా  ఏవియేషన్‌ అధికారులు సింధుకు ఈ అవకాశం కల్పించారు. కో పైల‌ట్‌గా ష‌ట్ల‌ర్ సింధు.. తేజస్‌లో ప్ర‌యాణించింది.

ఏవియేషన్‌ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా ఏరో ఇండియా పలు కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగానే పీవీ సింధు, ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ తేజస్‌ యుద్ధ విమానంలో వివహరించాలని కోరింది. వీరితో పాటు పూర్తిగా మహిళలతో కూడిన యుద్ధ విమానం కూడా ఎగరనుంది. తేజస్‌లో విహరించినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది సింధు.