
తాష్కెంట్: పోటీ పడ్డ తొలి వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లోనే సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకున్న తెలంగాణ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్ ఫైనల్పై గురి పెట్టాడు. అతనితో పాటు ఇండియా బాక్సర్లు దీపక్ భోరియా, నిశాంత్ దేవ్ శుక్రవారం జరిగే సెమీఫైనల్ బౌట్స్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురూ సెమీస్ చేరడంతో ఈ టోర్నీతో ఇండియాకు రికార్డు స్థాయిలో మూడు మెడల్స్ ఖాయం అయ్యాయి. అదే జోరుతో గోల్డ్ మెడల్ దిశగా ముందడుగు వేయాలని ఈ ముగ్గురూ భావిస్తున్నారు.
కానీ, వీరికి కఠినమైన ప్రత్యర్థులతో సవాల్ ఎదురవనుంది. 57 కేజీ సెమీస్లో హుస్సామ్.. క్యూబాకు చెందిన సైడెల్ హోర్టాతో తలపడనున్నాడు. హోర్టా క్వార్టర్స్లో టాప్ సీడ్, వరల్డ్, ఆసియా చాంపియన్షిన్షిప్స్ సిల్వర్ మెడలిస్ట్ను ఓడించి జోరు మీదున్నాడు. అయితే, తన అనుభవం, టెక్నిక్తో హోర్టా పని పట్టాలని హుస్సామ్ భావిస్తున్నాడు. 51 కేజీ సెమీస్లో దీపక్.. ఫ్రాన్స్కు చెందిన బిలాలా బెనామతో పోటీ పడనున్నాడు. బిలాలాకు ఈ టోర్నీలో రెండు మెడల్స్ నెగ్గిన అనుభవం ఉంది. 71 కేజీ సెమీస్ బౌట్లో నిశాంత్.. గతేడాది ఆసియా చాంపియన్ అస్లాన్బెక్ (కజకిస్తాన్)తో అమీతుమీ తేల్చుకోనున్నారు.