- కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు : ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న వరికెపూడిశెల లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్ పనులను ఆపాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. గురువారం కేఆర్ఎంబీ చైర్మన్శివ్ నందన్ కుమార్కు ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. పల్నాడు జిల్లా మాచర్లలో లిఫ్ట్స్కీం నిర్మాణానికి ఈ నెల 15న శంకుస్థాపన చేశారని ఈఎన్సీ తన లెటర్లో వెల్లడించారు.
ALSO READ : ఇంటి వద్దే ఓటేసిన వృద్ధులు, దివ్యాంగులు
ఈ ప్రాజెక్టు ఫేజ్–1 పనులను రూ.340.26 కోట్లతో, రెండో దశ రూ.3,809 కోట్లతో చేపట్టనున్నట్లు చెప్పారు. రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీల నీటిని తరలించేలా లిఫ్ట్ స్కీమ్ చేపడుతున్నారని వివరించారు. అపెక్స్ కౌన్సిల్ సహా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్రా జెక్ట్ కడుతున్నారని ఆరోపించారు.