తెలంగాణలో కొత్త కేసులు 1,217

తెలంగాణలో కొత్త కేసులు 1,217

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,217 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకోలేక మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 48 వేల 434 మందికి పరీక్షలు చేయగా 1,217 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 26,498 మంది హోం ఐసొలేషన్ లో , ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. గడచిన 24 గంట్లో ఓ వ్యక్తి చనిపోయారు. మరో 3,944మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో  మొత్తం కేసుల రికవరీ శాతం 96 నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.  

 

ఇవి కూడా చదవండి...

ఇండియాలో కొత్త ట్రెండ్.. ఆ కంపెనీలో వీక్లీ శాలరీ

ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు

రాజ్యాంగాన్ని కాదు..రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి