బిల్లులు వెంటనే చెల్లించకుంటే విద్యుత్ను నిలిపివేస్తామని బెదిరించి ప్రజలను మోసం చేసే సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్) ప్రజలను హెచ్చరించింది.
సైబర్ నేరగాళ్లు కొత్తగా ఆన్లైన్లో కరెంటు బిల్లులు చెల్లించే వారిని టార్గెట్చేసుకున్నారని.. వారు మెసేజ్ల రూపంలో తాము విద్యుతు ఆఫీస్ నుంచి అని పరిచయం చేసుకుంటూ.. మీరు కరెంటు బిల్లు కట్టలేదు.. ఈ నంబర్ కి వెంటనే బిల్లు పే చేయండి అంటూ ఓ గుర్తు తెలియని నంబర్ని పంపుతున్నారు.
సైబర్ నేరగాళ్లు పంపిన నంబర్ కి ఫోన్ చేస్తే వాళ్లు ఓ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెబుతారు. అడిగిన విధంగా వివరాలివ్వగానే ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు వివరాలను తస్కరిస్తారు. వివిధ పద్ధతుల ద్వారా బ్యాంక్ అకౌంట్లోని అమౌంట్ మొత్తం విత్డ్రా చేస్తారు.
ఇలా సరికొత్త మోసానికి సైబర్ నేరగాళ్లు తెరతీశారని అధికారులు చెబుతున్నారు. టీఎస్ ఎస్ పీడీసీఎల్ బిల్లు చెల్లింపుల కోసం ఎలాంటి వెబ్సైట్ లింకులను విద్యుత్తు శాఖ ఎప్పుడూ పంపదని.. అలాంటి వారిని నమ్మవద్దని సూచిస్తున్నారు. బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీ తదితర వివరాలు ఎవరితో షేర్ చేసుకోవద్దని వెల్లడించారు. బాధితులెవరైనా మోసపోయామని గుర్తిస్తే వెంటనే1930 నంబర్ కి ఫోన్ చేసి కంప్లెంట్ చేయాలని చెప్పారు.