వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ సిబ్బంది సేవల కొనసాగింపు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వంవైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గౌరవ వేతన కేటగిరీల్లో పనిచేసే 15,803 మంది సిబ్బందిని విధుల్ని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
వారి సర్వీసుల్ని 2024 మార్చి 31 వరకు పొడగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. వీటి ప్రకారం.. 8,853 మంది ఔట్ సోర్సింగ్, 4,157 మంది కాంట్రాక్టు, 2,793 మంది గౌరవ వేతనం ప్రాతిపాదికన పని చేసే ఉద్యోగుల పోస్టులు మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి.
గతంలో 532 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సర్వీసులు పెంపుదలకు సంబంధించిన నిర్ణయానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది.