ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌..  2.73శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌..  2.73శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం 2.73శాతం డీఏను పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం (జూన్ 19న) ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ నెల నుంచి డీఏను పెంచింది. పెంచిన డీఏ 2022 జనవరి నుంచి అమలుకానున్నది. పెన్షనర్లు, ఉద్యోగుల మూలవేతనంలో రూ.2.73శాతం డీఏ పెరుగనున్నది. దీంతో 7.28లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి కలగనుంది.

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా డీఏ మంజూరు చేసినట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 7.28లక్షల మంది పెన్షనర్లు, ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.974.16కోట్ల అదనపు భారం పడుతుందని, నెలకు రూ.81.18కోట్ల భారం పడుతుందని వివరించారు. పెంచిన డీఏ ప్రకారం.. రూ.1380.09 కోట్ల ఎరియర్స్‌ చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.