బంగారు ‘భవిత’ .. ప్రత్యేక అవసరాలున్నచిన్నారులకు సర్కారు బాసట

బంగారు ‘భవిత’ .. ప్రత్యేక అవసరాలున్నచిన్నారులకు సర్కారు బాసట
  • పిల్లలను తీసుకొచ్చే పేరెంట్స్​కు అలవెన్స్​
  • టీచింగ్, లర్నింగ్​ మెటీరియల్​కు ఒక్కో స్కూల్​కు రూ.2 లక్షలు 
  • సొంత బిల్డింగ్​కు రూ. 9 లక్షలు
  • వారానికి రెండ్రోజులు ఫిజియోథెరపీ

 యాదాద్రి, నల్గొండ, వెలుగు : ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. చిన్నారుల భవిష్యత్​కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్లలో అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం ఫండ్స్​రిలీజ్ చేస్తున్నాయి. పాఠశాల స్థాయి చిన్నారులకు ఐఈఆర్పీ (ఇన్‌‌క్లూసివ్‌‌ ఎడ్యుకేషన్‌‌ రిసోర్స్‌‌ పర్సన్‌‌) ప్రత్యేకంగా బోధన అందిస్తుంది. 

మండలానికో భవిత కేంద్రం..

తల్లిదండ్రుల అనారోగ్యం.. ఇతర కారణాలతో శారీరకంగా ఫిట్​గా లేని పిల్లలు జన్మిస్తారు. వీరిలో మానసికంగా వైకల్యం కలిగిన పిల్లలు కూడా ఉంటారు. సరిగా మాట్లాడలేని, నడవలేని వీరికి సేవ చేయలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో కన్నవారే విసుక్కునే సందర్భాలు కూడా ఉంటాయి. ఇటువంటి మానసిక దివ్యాంగులు, శారీరకంగా పటుత్వం లేని పిల్లలను ప్రత్యేక అవసరాలు కలిగిన వారిగా గుర్తిస్తారు. వీరి కోసం సర్వశిక్ష అభియాన్​ కింద ప్రతి మండలంలో 'భవిత' సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి సెంటర్​లో ఐఈఆర్పీని నియమించి స్టూడెంట్స్​కు ప్రత్యేక పద్దతుల్లో బొమ్మలు చూపిస్తూ విద్యాబోధన చేస్తున్నారు. సెంటర్​కు రాలేని స్థితిలో ఉన్న పిల్లలకు ప్రతి శనివారం ఇంటికి 
వెళ్లి బోధిస్తున్నారు. 

తల్లిదండ్రులకు అలవెన్స్..​

పిల్లలను భవిత సెంటర్​కు తీసుకొచ్చే పేరెంట్స్​కు ఎస్కార్ట్, ట్రాన్స్​పోర్ట్​, రీడింగ్ అలవెన్స్ కింద ప్రభుత్వం ప్రతినెలా రూ.1400 అందిస్తుంది. ఆడపిల్లలు అయితే స్టైఫండ్​కింద మరో రూ.500 అందిస్తారు. ఈ అమౌంట్​ను నేరుగా స్టూడెంట్స్​అకౌంట్స్​లోనే జమ చేస్తారు. స్టూడెంట్స్​అకౌంట్స్​సరిగా లేనందు వల్ల యాదాద్రి జిల్లాలో 42 మంది స్టూడెంట్స్​కు రావాల్సిన రూ.2 లక్షలు రిటన్ వెళ్లిపోయాయి.

వారానికి రెండ్రోజులు ఫిజియోథెరపీ..

ప్రతి భవిత సెంటర్​కు ఫిజియోథెరపిస్ట్​ను ఏర్పాటు చేశారు. వీరు శారీరకంగా పటుత్వం లేకుండా ఉన్న పిల్లలకు మసాజ్​ చేస్తూ సర్వీస్​అందిస్తారు.  గతంలో వారానికి ఒక్కరోజే వీళ్లు సెంటర్​కు వచ్చేవారు. తాజాగా వారానికి రెండు  రోజులు స్టూడెంట్స్​కు థెరపీ అందిస్తారు. ఫిజియో థెరపిస్ట్​కు ఒక్కో రోజు రూ.వెయ్యి ఫీజుగా అందిస్తున్నారు. 

అందంగా బిల్డింగ్స్..​

కొన్ని చోట్ల భవిత కేంద్రాలకు సొంత బిల్డింగ్స్​ఉండగా, మరికొన్ని సెంటర్లలో అద్దె బిల్డింగ్స్​లో కొనసాగున్నాయి. అయితే ఆ బిల్డింగ్స్​ను కలర్స్​తో రకరకాల బొమ్మలతో అందంగా అలంకరించారు. చిన్నారులకు భవిత కేంద్రాల్లో ప్రత్యేకమైన టాయిలెట్స్, ర్యాంపులు, రెయిలింగ్​ ఏర్పాటు చేశారు. వీరి కోసం రూ.2 లక్షలతో టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ (టీఎల్​ఎం) సమకూరుస్తోంది. అద్దె బిల్డింగ్స్​లో కొనసాగుతున్న సెంటర్లకు సొంత బిల్డింగ్​కోసం ఒక్కోదానికి రూ.9 లక్షల చొప్పున ప్రభుత్వం ఫండ్స్ మంజూరు చేసింది. 

సొంత భవనాలకు నిధులు..

యాదాద్రి జిల్లాలో 17 భవిత సెంటర్లున్నాయి. వీటిలో 5 సొంత బిల్డింగ్​లు ఉండగా, 12 అద్దె బిల్డింగ్స్​లో కొనసాగుతున్నాయి. సొంత బిల్డింగ్స్ నిర్మాణం కోసం 1.08 కోట్లు మంజూరు చేశారు. నల్గొండ జిల్లాలో 31 భవిత సెంటర్లున్నాయి. కలెక్టర్​ఇలా త్రిపాఠి ప్రత్యేక చొరవతో ఇక్కడ సొంత బిల్డింగ్స్ నిర్మాణం కోసం రూ.1. 20 కోట్లు మంజూరు చేశారు. సూర్యాపేట జిల్లాలో 25 భవిత సెంటర్లున్నాయి. 7 సొంత బిల్డింగ్స్​ఉండగా, 18 అద్దె బిల్డింగ్స్​లో నడుస్తున్నాయి. సొంత బిల్డింగ్స్ నిర్మాణం కోసం 1.32 కోట్లు మంజూరయ్యాయి.