తెలంగాణలో వీసీల నియామకానికి నోటిఫికేషన్..ఫిబ్రవరి 12 లాస్ట్ డేట్

తెలంగాణలో వీసీల నియామకానికి నోటిఫికేషన్..ఫిబ్రవరి 12 లాస్ట్ డేట్

తెలంగాణలో పది యూనివర్శిటీల వీసీల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఉస్మానియా, జేఎన్టీయూ హైదరాబాద్,మహాత్మగాంధీ, కాకతీయ, శాతవహన, తెలంగాణ, పాలమూరు, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీలకు వీసీల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది.  అయితే నోటిఫికేషన్ లో బాసర ట్రిపుల్ ఐటీ, కోఠి మహిళా యూనివర్సిటీలు లేవు.  అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి12 వరకు గడువు ఇచ్చింది ప్రభుత్వం. జనవరి 28 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోందని తెలిపింది.

ప్రస్తుత వీసీల టర్మ్  ఈ సంవత్సరం మే వరకు ఉండటంతో కొత్త వీసీ నియమకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం యూనివర్సిటీల  వీసీలపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.యూనివర్సిటీల వీసి లను తొలగించాలంటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.