రైతు చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్ రెడ్డి

రైతు చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్ రెడ్డి

కామారెడ్డి జిల్లాలో సెల్ టవర్ ఎక్కి ఉరి వేసుకున్న రైతు చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి.. సెల్ టవర్ ఎక్కి ఉరేసుకుంటున్న రైతును కాపాడేందుకు సమయం ఉన్నా.. ప్రభుత్వ యంత్రాంగం స్పందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని అలాగే రైతు పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

గుండెలు పిండేసే విషాదం

‘‘ఒకవైపు డాడీ… డాడీ అని పసిబిడ్డల రోదన… మరో వైపు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని భరించలేక సెల్ టవర్ పై ఉరికొయ్యకు వేలాడిన రైతు... రైతును కాపాడేందుకు సమయం ఉన్నా స్పందించని యంత్రాంగం...  కేసీఆర్ పాలనలో మొద్దుబారి… బండరాయిగా మారిన వ్యవస్థల దుర్మార్గానికి నిదర్శనం ఇది..’’ అని రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.