
తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ వాదనలతో కోర్టు ఏకీభవించింది. సచివాలయం కూల్చొద్దంటూ దాఖలైన పిటీషన్లను కోర్టు కొట్టేసింది. సెక్రటేరియట్ కూల్చివేతపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఆ వాదనలన్నీ విన్న తర్వాత కోర్టు సచివాలయ కూల్చివేతకు అనుమతులిచ్చింది.
ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ శిధిలావస్థకు చేరుకోవడంతో.. మరో కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు విరుద్ధంగా కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఆ కేసుకు సంబంధించి హైకోర్టు ఈ రోజు తీర్పు చెప్పింది.