- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వైన్స్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పిస్తూ గత నెల 20 ఇచ్చిన జీవో 21పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మద్యం షాపుల రిజర్వేషన్ల తీరును తప్పుపడుతూ ఖమ్మం జిల్లాకు చెందిన వి.రవికాంత్ వేసిన రిట్ను బుధవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. గౌడ్లకు15, ఎస్సీలకు10, ఎస్టీలకు 5 శాతం చొప్పున షాపుల్ని కేటాయించారని, బీసీల్లో మిగిలిన కులాలకు రిజర్వేషన్లు ఇవ్వలేదంటూ పిటిషనర్ తరఫున అడ్వకేట్ అభ్యంతరం చెప్పారు. బీసీలను ఏబీసీడీలుగా విభజించారని, వీరిలో గౌడ్లకు మాత్రమే వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు ఇవ్వడం అన్యాయమన్నారు. దీంతో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.