పెద్దపల్లి జిల్లాలో ఇసుక క్వారీల మైనింగ్లో భారీగా అక్రమాలు జరగుతున్నాయంటూ మహిళా న్యాయవాది గట్టు వెంటక నాగమణి రాసిన లేఖను తెలంగాణ హైకోర్టు పిల్గా పరిగణిస్తూ విచారణకు స్వీకరించింది. రూ.50 కోట్ల విలువ చేసే ఇసుకను 5 కోట్ల రూపాయాలకే దోచిపెడుతున్నారన్న ఆమె ఆరోపణలపై సోమవారం విచారణ చేపట్టింది. జిల్లాలోని మంథని నియోజకవర్గం పరిధిలోని వెంకటాపూర్ ఇసుక క్వారీ నిర్వహణపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. గత నెల 16న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్పై కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్టు. మంథని నియోజకవర్గంలోని వెంకటాపూర్ గ్రామ మానేరు ఇసుక క్వారీ మైనింగ్కు నిబంధనలను కాలరాస్తూ అనుమతి జారీ చేశారని, దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ను నిలిపేయాలని కోరుతూ మహిళా న్యాయవాది నాగమణి హైకోర్టుకు లేఖ రాశారు. దాదాపు 50 కోట్ల విలువ చేసే ఇసుక క్వారీని రూ.5 కోట్లకే అప్పగించారని ఆమె తన లెటర్లో కోర్టుకు వివరించారు. ఆ క్వారీలో ఇష్టానుసారం తవ్వకం జరుపుతున్నారని, దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, పర్యావరణం దెబ్బతింటోందని తెలిపారు. అనేక నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా ఇసుక రవాణా చేస్తున్నారని ఆమె తన పిటిషన్లో చెప్పారు. వెంకటాపూర్ గ్రామానికి జరుగుతున్న నష్టాన్ని నివారించాలని కోరారు. అలాగే మంథని నియోజకవర్గ పరిధిలోని మరో 14 ఇసుక క్వారీల అక్రమాలపైనా విచారణ జరిపి చర్యలకు ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆమె లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపడుతున్నట్లు హైకోర్టు ఇవాళ తెలిపింది. ఈ కేసులో రాష్ట్ర మైనింగ్ శాఖ అధికారులు మొదలు.. జిల్లా స్థాయి వరకు 9 మంది అధికారులను, శాఖలను ప్రతి వాదులుగా చేర్చి.. వారికి నోటీసులు జారీ చేసింది. గడిచిన నాలుగేళ్లుగా జరుగుతున్న ఇసుక రవాణాపై పూర్తి వివరాలు తెలపాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
50 కోట్ల ఇసుకను 5 కోట్లకే ఇచ్చేశారు… హైకోర్టుకు మహిళ లెటర్
- తెలంగాణం
- June 22, 2020
లేటెస్ట్
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో మనుషులు మింగే 40 రకాల ట్యాబ్లెట్స్ సీజ్.. మెడికల్ షాపులు సీజ్
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్