జులైలో తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్షలు! 

జులైలో తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్షలు! 

తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తన అభిప్రాయాలను తెలిపింది. కరోనా కారణంగా నిలిచిపోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జులై మధ్య నిర్వహించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శికి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి లేఖ రాశారు. పరీక్ష సమయాన్ని మూడు గంటల నుంచి గంటన్నరకు తగ్గించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే సిద్ధమైనందున పరీక్ష విధానాన్ని మార్చలేమని తెలిపింది. అయితే, ప్రశ్నాపత్రంలోని సగం ప్రశ్నలకే సమాధానాలు రాసేందుకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కరోనా కారణంగా పరీక్షలకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు మరోసారి నిర్వహిస్తామని, ఫలితాలను ఆగస్టు నెలాఖరులో  ప్రకటిస్తామనా త తెలిపింది.