దేశంలోనే తెలంగాణ నెంబర్​వన్..మంత్రి ప్రశాంత్​రెడ్డి

దేశంలోనే తెలంగాణ నెంబర్​వన్..మంత్రి ప్రశాంత్​రెడ్డి

నందిపేట, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్​జనరంజక సంక్షేమ పథకాలు, పరిపాలన అందిస్తుండడం వల్ల నేడు తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్​వన్​లో ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల  ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నందిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ స్పీకర్​ మధుసూదనాచారి, ఎమ్మెల్యే జీవన్​రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉన్న బీఆర్ఎస్​ సైన్యం నేడు వేలల్లోకి చేరుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జీవన్​రెడ్డిని ఎమ్మెల్యేగా  గెలిపించాలని ప్రజలను కోరారు. 

మాజీ స్పీకర్​ మధుసూదనాచారి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో అడుగడుగునా ప్రతికూల పరిస్థితులే ఎదురైనా కేసీఆర్​ ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తుండడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. జడ్పీ చైర్మన్​ విఠల్​రావ్​ మాట్లాడుతూ బీఆర్ఎస్ లో ఫైరవీలకు తావులేదని, కష్టపడ్డవారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే జీవన్​రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం లేని నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ ​చైర్మన్​ఆకుల లలిత, మార్క్​ఫెడ్​ చైర్మన్​ మార గంగారెడ్డి, రాజారాం యాదవ్​ మాట్లాడారు.