చేవెళ్ల, వెలుగు: భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘కొడుకులారా.. బిడ్డలారా, దారి తప్పుతున్నారో.. మహమ్మారి గంజాయికి బానిసలు అవుతున్నారో’ పాట షూటింగ్ ప్రారంభమైంది.శుక్రవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమత్నగర్లోని చైతన్య డ్రీమ్ యూనివర్సిటీలో షూటింగ్ నిర్వహించారు.
ప్రొఫెసర్ కోదండరాం క్లాప్ కొట్టగా.. మా భూమి సినిమా డైరెక్టర్ బి.నర్సింగ్ రావు కెమెరా ఆన్ చేశారు. అనంతరం సినీ నటి ఆమని తన నటన ద్వారా విద్యార్థులకు గంజాయిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వల సుజాత, చైతన్య డ్రీమ్ యూనివర్సిటీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగరి రాజు, మేకగూడెం బిక్షపతి పాల్గొన్నారు.
