
- ట్రక్కులో వెళ్తుండగా యాక్సిడెంట్ .. స్పాట్ డెడ్
- జగిత్యాల జిల్లా అల్లీపూర్ లో విషాదం
రాయికల్, వెలుగు: ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లిన తెలంగాణకు చెందిన ఒకరు అక్కడ జరిగిన యాక్సిడెంట్ లో చనిపోయాడు. జగిత్యాల జిల్లా రాయికల్మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన దాసరి రమేశ్(42) కొన్నేండ్ల కింద ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. అక్కడి ఓ బేకరీలో పని చేస్తున్న రమేష్ శుక్రవారం ట్రక్కులో వెళ్తుండగా మరో ట్రక్కు వచ్చి ఢీకొట్టడడంతో స్పాట్లో చనిపోయాడు.
దీంతో అతని స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రమేశ్కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. డెడ్ బాడీని త్వరగా రప్పించేలా చర్యలు చేపట్టాలని కుటుంబసభ్యులు, గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.