
హైదరాబాద్, వెలుగు: చెప్పిన పంటను వేస్తేనే రైతు బంధు ఇస్తామన్న షరతు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. షరతుల సాగు అంశం లేకుండా రైతు బంధు గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. బడ్జెట్ ఎస్టిమేషన్ సందర్భంగా జనవరి 23న సీసీఎల్ఏ ఇచ్చిన వివరాల్లోని పట్టాదారులకు మాత్రమే ఈ ఏడాది రైతు బంధు పథకం డబ్బులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది . తక్కువ భూమి ఉన్న రైతులకే ముందుగా డబ్బులు అందజేయనుంది. ఈసారి ఆర్వోఎఫ్ఆర్ (రికగ్నే షన్ ఆఫ్ ఫారెస్ట్ ట్యాక్స్ ) రైతులకు కూడా రైతు బంధు ఇవ్వనుంది. ఇక ఏటాఒకేసారి లబ్ధిదారుల వివరాలను పరిగణనలోకి తీసుకోనుంది. 2020–21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రైతు బంధు గైడ్ లైన్స్ ను రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శిబి.జనార్థన్రె డ్డివిడుదల చేశారు. వానాకాలం, యాసంగి సీజన్ల వారీగా ఎకరానికి రూ. 5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.
పట్టా రైతులు 59.30 లక్షలు
ఈ ఏడాది జనవరి 23న సీసీఎల్ఏ వ్యవసాయ శాఖ భూ సమాచారం సేకరించింది . ఆ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కోటి 47 లక్షల 66 వేల ఎకరాల పట్టా భూమి 59.30 లక్షల మంది రైతుల ఆధీనంలో ఉంది. వీరికి ఈసారి రైతు బంధు సాయం అందించను న్నారు. అటవీ భూముల హక్కులు (ఆర్వోఎఫ్ఆర్) న్న రైతులకు రైతుబంధు అందించనున్నారు. 2.99 లక్షల ఎకరాలు ఆర్వోఎఫ్ఆర్ పట్టాభూమి 92 వేల మంది రైతులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా గైడ్ లైన్ ప్రకారం వీరికి రైతు బంధు అందనుంది.
వానాకాలానికి రూ.7,352 కోట్ల అవసరం
ఈసారి వానాకాలం సీజన్కు ఎకరాకు రూ. 5 వేల చొప్పున కోటి 47 లక్షల 66వేల ఎకరాలకు రూ.7,352 కోట్లు పెట్టుబడి సాయం అవసరం అవుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్కు రూ.7 వేల కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇందులో రూ. 5,500 కోట్లు వ్యవసాయ శాఖకు ప్రభుత్వం బదిలీ చేసినట్లు సమాచారం. మరో రూ. 1,500 కోట్లు వి డుదలకు సిద్ధం గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి మరో రూ. 352 కోట్ల అదనంగా అవసరం కానున్నాయి. ఇక ఆర్వోఎఫ్ ఆర్ భూములకు సంబంధిం చి రూ. 149 కోట్లు అవసరమవుతాయిని అంచనా. వారం రోజుల్లో ఖాతాల్లో డబ్బులు జనవరి 23 నాటికి డిజిటల్ సైన్ అయిన పట్టాదా రుల ఆధార్, బ్యాంకు వివరాలను ఏఈవోలు సేకరి స్తున్నారు. ఈ ప్రకియ తుది దశకు చేరుకుంది . ఇది ముగియగానే.. అంటే వారం రోజుల్లో రైతుబంధు సొమ్ము జమ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ముందుగా తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేయనుంది. రైతుబంధు అమలుకు కమిటీలు రైతు బంధు అమలు కోసం రాష్ట్ర సర్కారు ప్రత్యేక కమిటీలను వేసింది. రాష్ట్ర కమిటీలో వ్యవసాయ శాఖ కార్యదర్శి చైర్మన్గా, కమిషనర్ కన్వీనర్గా, ఆర్ధికశాఖ కార్యదర్శి , ఎస్ఎల్బీసీ కన్వీ నర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్సభ్యులుగా ఉంటారు. ఇక జిల్లాల్లో అమలు కోసం జిల్లాస్థాయిలోనూ సర్కారు కమిటీలు ఏర్పాటు చేసింది.
రూల్స్ ఇవే..
జనవరి 23 నాటికి డిజిటల్ సైన్ అయిన పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా (బడ్జెట్ ప్రతి పాదనల టైంలో సీసీఎల్ఏ అందించిన డేటా) రైతు బంధు ఇవ్వనున్నారు. సీసీఎల్ఏ సమర్పించిన పట్టదారులతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదా రులకు రైతు బంధు సాయం అందిస్తారు. పెద్ద పల్లి జిల్లాలోని కాసుపల్లిలో దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న 621మంది పట్టాదారులకు ప్రత్యేక పరిస్థితుల్లో సాయం అందిస్తారు. కొత్త పట్టదారులను వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అర్హులుగా పరిగణిస్తారు. రైతుబంధు కోసం ఏడాదిలో ఒకేసారి వివరాలు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతిసీజన్కు ముందు భూముల లావాదేవీల ను పరిశీలిస్తారు. అమ్మిన భూముల వివరాల ను రైతుబంధు జాబితా నుంచి తొలగిస్తారు. కొత్తగా కొన్నవారికి వచ్చే ఏడాది రైతు బంధు ఇవ్వనున్నారు. దశలవారీగా నిధుల విడుదలలో భాగంగా తొలుత తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో ముందుగా వీరి ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రైతుబంధు పెట్టుబడి సాయాన్ని వదులుకోవాలనుకునేవారు గివ్ ఇట్ అప్ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డబ్బును రైతుబంధు సమితి ఖాతాలో జమచేస్తారు. రైతుబంధు డబ్బును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
రూల్స్ ఇవే..
జనవరి 23 నాటికి డిజిటల్సైన్అయిన పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా (బడ్జెట్ ప్రతిపాదనల టైంలో సీసీఎల్ఏ అందించిన డేటా)
రైతుబంధు ఇవ్వనున్నారు. సీసీఎల్ఏ సమర్పించిన పట్టదా రులతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదా రులకు రైతుబంధు సాయం దిస్తారు.పెద్ద పల్లి జిల్లాలోని కాసుపల్లిలో దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న 621మంది పట్టాదా రులకు ప్రత్యేక పరిస్థితుల్లో సాయం అందిస్తారు. కొత్త పట్టదా రులను వచ్చే ఆర్కథి సంవత్సరం నుంచి అర్హులుగా పరిగణిస్తారు. రైతుబంధు కోసం ఏడాదిలో ఒకేసారి
వివరాలు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతిసీజన్కు ముందు భూముల లావాదేవీల ను పరిశీలిస్తారు. అమ్మిన భూముల వివరాల
ను రైతుబంధు జాబితా నుంచి తొలగిస్తారు. కొత్తగా కొన్నవారికి వచ్చే ఏడాది రైతుబంధు ఇవ్వనున్నారు. దశలవారీగా నిధుల విడుదలలో భాగంగా
తొలుత తక్కువ విస్తీర్ణంఉన్నరైతులకు ప్రాధా న్యంఇస్తారు. దీంతో ముందుగా వీరి ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రైతుబంధు పెట్టుబడి సాయాన్నివదులుకోవాలనుకునేవారు గివ్ ఇట్ అప్ ఫారంఇవ్వాల్సి ఉంటుంది. ఈ డబ్బును రైతుబంధు సమితిఖాతాలో జమచేస్తారు.
రైతుబంధు డబ్బును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.