హైదరాబాద్: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశం (అడ్మిషన్లు) కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. వచ్చే నెల 8వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్ 17న 6వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 16వ తేదీన 7 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశానికి పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షల ఫలితాలను మే 20వ తేదీన విడుదల చేనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది.
ఇవి కూడా చదవండి
ఘనంగా బీటింగ్ రిట్రీట్.. డ్రోన్ షోతో అగ్ర దేశాల సరసన భారత్
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత ఆష్లే బార్టీ