సాలూరా వద్ద.. బార్డర్ చెక్పోస్ట్.. మైనింగ్ ఎండీ భవేశ్ మిశ్రా

సాలూరా వద్ద.. బార్డర్ చెక్పోస్ట్.. మైనింగ్ ఎండీ భవేశ్ మిశ్రా

నిజామాబాద్, వెలుగు: మహారాష్ట్ర సర్కార్​ జిల్లా బార్డర్​లోని మంజీరా నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చినందున తెలంగాణ గవర్నమెంట్​అలర్ట్​ అయింది. బోలేగావ్​, గంజ్​గావ్​ విలేజ్​లు ఆనుకొని మంజీరాలో క్వారీలు ఓపెన్​ కాబోతున్నాయి. ఇసుక వాహనాలు ఎక్కువ శాతం నిజామాబాద్​ జిల్లా మీదుగా వెళ్లనున్న నేపథ్యంలో శనివారం రాష్ట్ర మైన్స్​శాఖ ఎండీ భవేశ్​మిశ్రా సాలూరా వద్ద బార్డర్​ చెక్​పోస్ట్​ ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర క్వారీల పేరుతో పర్మిషన్​ లేకుండా ఇసుక ట్రాన్స్​పోర్టు నిరోధించడం, రోడ్లను శిథిలం చేసి యాక్సిడెంట్స్​కు కారణమయ్యే ఓవర్​ లోడ్​ను అరికట్టడం చెక్​ పోస్టు ఏర్పాటు ఉద్దేశ్యమన్నారు.

క్వారీలు నడిచినన్ని రోజులు చెక్​పోస్ట్​ పనిచేస్తుందన్నారు. మంజీరా నదిలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులను ఆధునిక టెక్నాలజీ వినియోగించి స్పష్టంగా ఏర్పాటు చేశామని ఇసుక తవ్వకాలకు రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉండదని తెలిపారు. ఆన్​లైన్​ బుకింగ్​ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దామన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా మైన్స్​ ఏడీ సంజయ్​, ల్యాండ్​ సర్వే ఏడీ అశోక్​